విజయదశమి సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటన సోషల్ మీడియా వేదికగా జరిగింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు.
పవన్ కళ్యాణ్ అయ్యాపనమ్ కోషియం చిత్రం రీమేక్ లో నటిస్తారని సమాచారం. ఇందులో ఆయన ఒక పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇతర తారాగణం, టెక్నికల్ టీమ్ పై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే అప్పుడే పుకార్లు మాత్రం వచ్చేస్తున్నాయి.
తాజాగా వినిపిస్తున్న పుకారు ప్రకారం ఈ మూవీని చిరంజీవి మరియు మోహన్ బాబు నటించిన బిల్లా రంగా అని టైటిల్ పెట్టాలి అని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. ఈ పుకారు మాట కాస్త అటుంచితే మూవీ దర్శకుడు సాగర్ చంద్ర మాటలను బట్టి ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
ఈ మూవీకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు అని.. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు అని తెలుస్తోంది. సితారా ఎంటర్ టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించనున్నారట.
0 Comments