రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీకి మరో మారు ఘర్షణ వచ్చిపడింది. ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుండగా ఇప్పట్లో ఎన్నికలకు వెళ్లే ఉద్దేశ్యం లేదని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అభిప్రాయపడుతోంది. మరి ఇది మరో వివాదంగానే చూడాలి. ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు ఈ ఏడాది మార్చిలో వాయిదా పడ్డాయి. ఆనాడు సడెన్ గా ఎన్నికల సంఘం ప్రధానాధికారి హోదాలో రమేష్ కుమార్ వాయిదా వేశారు. ఇపుడు మళ్ళీ అనూహ్యంగా ఆయన ఎన్నికలకు రెడీ అంటున్నారు.
0 Comments